సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బీసీ లకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిన పాలక పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకురాలి తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , ఆ దిశగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడంలో విఫలమై నా బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నాయకత్వం విఫలమైందని నా బీసీ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఆవేదనతో కలత చెందిన ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది . ఆయనకు నివాళిగా తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పూలే ప్రాంగణం నుండి మయూరి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ ర్యాలీకి బీసీ జేఏసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ పెరుగు వెంకటరమణా యాదవ్ అధ్యక్షత వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి కృష్ణారావు , ఖమ్మం జిల్లా బీసీ ఉద్యమా నాయకులు మేకల సుగుణ రావు , పిండిపోలు రామ్మూర్తి బిసి జేఏసీ , బత్తిని మధు గౌడ్ , నరేందర్ విద్యావంతుల వేదిక , విజయ్ తెలంగాణ పీపుల్స్ జేఏసీ , కాకి భాస్కర్ స్పర్శ అధ్యయన వేదిక , బెజ్జంకి ప్రభాకర చారి టీఎన్జీవో , నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు ఎలమందల జగదీష్ , విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు వసంత బాబు , తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు బచ్చల పద్మాచారి , బద్రు నాయక్ నంగారా బేరి రాష్ట్ర నాయకులు , దాసరి శ్రీనివాస్ మాల మహానాడు , పాపారావు చారి , కొరివి ధనలక్ష్మి బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు , పోతురాజు రమాదేవి , నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు . పూలే విగ్రహం దగ్గర అమరుడు సాయి విశ్వనాచారి మృతికి సంతాపాన్ని ప్రకటించారు . బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వర చారి స్ఫూర్తి తోటి మరో ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు . 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో యువ నిరాకరించిన కాంగ్రెస్ , బిజెపి పార్టీల అవకాశవాద వైఖరికి నిరసనగా ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నాడు . ఇప్పటికైనా కాంగ్రెస్ , బిజెపి పార్టీలు స్పందించి న్యాయబద్ధంగా ఆలోచన చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టే బిల్లును ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .

  • Related Posts

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికత విప్లవం

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 21 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 15 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 22 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 21 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 18 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 20 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి