
ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలోని 30వ డివిజన్లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహోత్సవం ప్రజల ఐక్యతను, భక్తి భావాన్ని చాటిచెప్పే పండుగగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలకు మరింత వైభవం తీసుకొచ్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ఈ సాంప్రదాయ ఉత్సవాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.





