ఖమ్మం కార్పొరేషన్ ఆగస్టు 6 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు



పేదల పక్షపాతి, నిజమైన ప్రజా నాయకులు కీ.శే పల్లా జాన్ రాములు గారి మనవరాలు, ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజు సందర్భంగా నిరుపేద అనాధ బాలికలకు శానిటరీ పాడ్స్ మరియు కాళ్లకు కొత్త చెప్పులు పంపిణీ చేసి, బాలికల మధ్య కేక్ కట్ చేసి, వారికి చాక్లెట్లు మరియు కేక్ పంపిణీ చేసి అనాధ బాలికలకు అండగా నిలిచిన పల్లా కిరణ్.
స్థానిక ఖమ్మం శాంతినగర్ ఏరియాలో శాంతి నగర్ బాల బాలికల స్కూల్ నందు చదువుకుంటున్న నిరుపేద బాలికలకు శానిటరీ పాడ్స్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అదేవిధంగా సెయింట్ మేరీస్ బాలికల హాస్టల్లో నివసిస్తున్న అనాధ బాలికలకు పాదరక్షలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో పల్లా కిరణ్ దృష్టికి తీసుకురాగా తన కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజు సందర్భంగా ఆ బాలికల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని బాలికలకు ఆరు నెలలకు సరిపడా శానిటరీ పాడ్స్ మరియు కాళ్లకు కొత్త చెప్పులు ఇచ్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్న పల్లా కిరణ్.
గత 20 సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఉదాహరణకు సంవత్సరానికి 2 రెండు సార్లు ఉచిత మోగా వైద్య శిబిరం నిర్వహించుట, కరోనా సమయంలో 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్స్ మరియు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ, వరదల సమయంలో నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యవసర సరుకులు మరియు బట్టలు పంపిణి ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సందర్భాల్లో అన్న దానాలు, నిరుపేద విద్యార్ధిని, విద్యార్థులకు ప్రాథమిక మరియు ఉన్నత విద్య కొరకు ఆర్ధిక సహాయం. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అనాధ బాలబాలికలకు మరియు యువతకు నిత్యం అనేక విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తు అండగా ఉండడం సంతోషంగా ఉన్నదని వ్యక్తం చేశారు.





