ఖమ్మం మధ్య రైల్వే గేటు వద్ద ఆర్ఓబి గ్రీన్ సిగ్నల్

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్

  • భూ సేకరణ కోసం వేచి చూస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటపడుతున్నాం
  • రాగానే పనులు మొదలు పెడతాం
  • ఎంపీ వద్దిరాజు వినతికి రైల్వే అధికారుల స్పందన

ఖమ్మం, డిసెంబర్, 16: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, తమ అప్పగిస్తే అక్కడ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు.
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల కోరిక మేరకు మధ్య గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోరుతూ.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే జీఎం కు గత నెలలో ఓ వినతిపత్రం అందజేశారు. ఆ మేరకు రైల్వే జీఎం స్పందించి ఆయకు ప్రత్యుత్తరం రాశారు. ఖమ్మం – పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్వోబి
నిర్మాణం భూ సేకరణ అంశంతో ముడిపడి ఉన్నందున, అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రైల్వే జీఎం తెలియజేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తన లేఖలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు స్పష్టం చేశారు.

  • Related Posts

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికత విప్లవం

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 21 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 15 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 22 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 21 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 18 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 20 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి