ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమం అభివృద్ధి పాలన అందించటమే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి

ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు

  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వెంకటగిరి ప్రాంతంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్, చింతపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… వెంకటగిరి లో రూ. 2 కోట్ల 55 లక్షల రూపాయలతో చేపట్టిన మిని స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. తాజాగా రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయలతో 33/11 కె వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసు కున్నామని అన్నారు.

ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో ఒక కోటి 10 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి ఖమ్మం – వరంగల్ హై వే రోడ్డు నిర్మాణానికి, ఒక కోటి 43 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి తిరుమలాయపాలెం – ఆరేకోడు బీటీ రోడ్డు నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గడిచిన ఇరవై నెలల కాలంలో ఇందిరమ్మ రాజ్యంలో చింతపల్లి గ్రామానికి దాదాపు రూ. 24 కోట్ల 74 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేశామని అన్నారు.

గ్రామంలో బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, పెండింగ్ ఉన్న రోడ్లు, పాఠశాల అభివృద్ధి పనులకు నిధులను విడతల వారిగా మంజూరు చేసి పూర్తి చేసే బాధ్యత తనదని మంత్రి తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు అందించే అవకాశాన్ని పరిశీలించి అర్హులకు చేరేలా చూడాలని మంత్రి రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ 200 యూనిట్ల ఉచితవిద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహాయం 12 వేలకు పెంపు, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు సొంతిల్లు అందించే పథకం నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు.

అనంతరం 56 మందికి కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ రాం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు