క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలిజిల్లా అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ ఐ.డి.ఓ.సి. ప్రాంగణంలోని ప్రగతి మీటింగ్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతోపి.సి.పి.ఎన్‌.డి.టి.యాక్ట్, ఎమ్‌.టి.పి యాక్ట్, బర్త్ & డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు, రోగుల భద్రత, రక్షణ, నిర్వహణ, రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో వైద్య ఆరోగ్య సంబంధిత సేవలను కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు అమలు చేయడానికి,గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం మరియు గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం నకు జిల్లాలో ఛైర్మన్ గా వున్నారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును నిరంతరం పరిశీలించాలని, గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్దారణ చట్టం-1994, రూల్స్‌-1996 అమలు గురించి ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశవుగా వున్నపుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. ఆసుపత్రులలో ‘ఇచట లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు, సేవ్ గర్ల్ చైల్డ్ ‘ పోస్టర్లు అందరికి కనపడే విధంగా ప్రదర్శిస్తున్నారా, లేదా అని పరిశీలించాలని అన్నారు. స్కానింగ్‌ సెంటర్లలో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ వుండాలని, ప్రతినెల జరిగే స్కానింగ్‌ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలని, ఆన్లైన్ పోర్టల్ లో కూడా నమోదు చేయాలనీ, లింగ నిర్ధారణ, పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయేది ఆడ మగ అని చెప్పడం, సంకేతాలు చూపెట్టడం కూడా నేరమని, జిల్లాలో 0-6 సంవత్సరాల వయసు గల ఆడపిల్లల శాతం క్రమక్రమంగా దిగజారిపోతున్నదని, అందుకు నైతిక, సామాజిక బాధ్యత అందరికి వర్తిస్తుందని, ఆసుపత్రుల నిర్వహణలో నాణ్యత, భద్రత, లైసెన్సులు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రత, మొదలైనవి చాలా ముఖ్యమైనవని, ఆసుపత్రులు సరైన ప్రమాణాలతో పనిచేస్తున్నాయా, లేవా, నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు చేపట్టాలని,ఆసుపత్రిలో అందించే వైద్య సేవల నాణ్యతలను,వైద్యుల నైపుణ్యతలను, రోగుల సంరక్షణ, చికిత్సా,ఆసుపత్రికి సరైన లైసెన్సులు ఉన్నాయా,లేవా , ఆసుపత్రికి గుర్తింపు వుందా, లేదా,అగ్నిమాపక భద్రత, వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రత వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలనీ,ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో నిర్వహించడం, తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడటం,రోగులకు సరైన చికిత్స అందించడం, వారి భద్రతను నిర్ధారించడం, ప్రమాదాలు జరగకుండా చూడటం,ఫార్మసీలో మందుల నిల్వ, గడువు తేదీలు, సరైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయా? లేదా? ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్‌లకు సరైన రిజిస్ట్రేషన్ ఉందా, లేదా,వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు, పనితీరును తనిఖీ చేయాలని,ఆసుపత్రి యాజమాన్యం ఈ నియమాలను పాటిస్తూ, లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, జిల్లాలో 519 హాస్పటల్స్ రిజిస్ట్రేషన్ అయి వున్నాయని, సాధారణ ప్రసవలు జరిగేలా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి ప్రజలకు ఉచిత వైద్య సేవలను శాంతి నిలయం లేదా కర్ణగిరి లలోఅందించాలని,

ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పారదర్శికంగా వైద్య సేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వెంకటరమణ, డా. చందు నాయక్,…

ముఖ్యమంత్రి మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారితో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ తో

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ….. సీఎం రేవంత్ రెడ్డి *భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడాలి *పిడుగుపాటు వల్ల మానవ, పశువు ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు…

ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునీకరణ పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి

సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి…

సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు రోజులపాటు మదిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభం లో జన్మించారు విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు

సిజ్ చేసిన ఇసుక “మాయా”జాలం.

#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్‌ చేసిన డంపులూ మాయం..# వేలంపాటరోజే అధికారులకు ఝలక్. సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు. *తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 )) పట్టుబడిన ఇసుక డంప్ లు…

సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో KCR, KTR దిష్టిబొమ్మలు దహనం చేసిన..కాంగ్రెస్ శ్రేణులు

సత్తుపల్లి ((.మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))◆ నిన్న ఖమ్మం జిల్లా పర్యటన లో KTR తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బట్టి గారిపై, శ్రీ తుమ్మల గారిపై,…

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరులో పర్యటించారు

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి *సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19* కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవంద మందికి అన్న ప్రసాద వితరణ

ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

పెనుబల్లి వద్ద సీతారామ జలాలని స్థానిక రైతులు నాయకులతో కలిసి గంగమ్మ పూజ చేసి రైతులకి అందిస్తున్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద

సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన……

కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 18 మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలిప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందిమీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు.సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే…

You Missed

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు
ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ
భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల
ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు
పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క