రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక ఆగిన గుండె

తెచ్చిన లోన్లు కట్టలేక..వచ్చే డబ్బులు రాక రిటైర్డ్‌ ఉద్యోగి మనోవేదన

గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి

నెల్లికుదురు, జూన్‌ 25 మన జ్యోతి బ్యూరో . వెంపటి నాయుడు

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండేటి సోమిరెడ్డి(63) రాజులకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయడిగా విధులు నిర్వర్తించి 2024, సెప్టెంబర్‌ 2న ఉద్యోగ విరమణ పొందాడు.ఆయనకు రావాల్సిన రూ.54 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందడానికి దరఖాస్తు చేసుకున్నాడు. రిటైర్మెంట్‌ కాక ముందు కొన్ని లోన్లు తీసుకున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తో వాటిని చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. రిటైర్‌ అయి 9 నెలలు గడుస్తున్నా సంబంధిత బెనిఫిట్స్‌ అందకపోవడం, పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న క్రమంలో.. రిటైర్డు అయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.. అందులో మీ నంబర్‌ ఎప్పుడో….? అని పలువురు అనడంతో అదే మాటను మనసులో పెట్టుకుని మనోవేదన గురై 14 రోజుల క్రితం బీపీ పెరగడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.నాకు రావాల్సిన రిటైర్మెంట్‌ డబ్బులు రాలేదు..మీరు ట్రీట్‌మెంట్‌కు రూ. లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు..? రిటైర్మెంట్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయో..? ఎందుకు చికిత్స కోసం అప్పులు చేస్తున్నారు అంటూ సోమిరెడ్డి మనోవేదన గురయ్యేవాడు. మానసిక వేదనతో ఫిజికల్‌గా ట్రీట్‌మెంట్‌కు బాడీ సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వచ్చి ఉంటే తన తండ్రి చనిపోయేవాడు కాదని మృతుడి కుమారుడు కిశోర్‌కుమార్‌ వాపోయాడు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు