మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది!

2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది!

అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు!

న్యూఢిల్లీ జాతీయ దినపత్రిక (( మన జ్యోతి ప్రచురించడం అయినది జులై 05 ))

2000 లో మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించాలని అని అనుకుంటున్నప్పుడు పాకిస్థాన్ కి చెందిన టెకీ అయిన జవ్వద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరుపున పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం సహకరించాడు. పాకిస్థాన్ లో ఉద్యోగులని ఇంటరవ్యూ చేసి ఉద్యోగులని రిక్రూట్ చేయడం తో పాటు కొన్నాళ్ళు అదే ఆఫీస్ లో పనిచేశాడు.

LinkedIn లో పోస్టు పెడుతూ రెహమాన్ భావోద్వేగానికి గురయ్యాడు. సరిగ్గా 25 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ లో IT పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని భావించాను మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం దానిలో నేను భాగస్వామి ని అవడం మీద ఆనందం అనుభవించాను. కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతుండడం బాధగా ఉంది!

జవ్వద్ రెహమాన్ తన LinkedIn పోస్టులో పాకిస్థాన్ IT మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మల్టినేషనల్ సంస్థలు ఒక్కొక్కటి పాకిస్తాన్ నుండి బయటికి వెళ్ళిపోతుండడం ఎందుకు జరుగుతున్నదో ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకొని పరిస్థితి చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు!

Well! Microsoft ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులని తొలగిస్తున్నది!

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులలో 4% మందిని అంటే 9,100 మందిని తోలగిస్తున్నది. ఇది క్లౌడ్ బేస్డ్ మరియు భాగస్వామ్య పధ్ధతిలో తన కార్యకలాపాలని షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో తీసుకుంటున్న చర్య అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది!

లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైనది కాదని 2022 లోనే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చినా మూడేళ్ల ఆలస్యంగా తన ఆఫీస్ తో పాటు అన్ని కార్యకలాలని ఆపేసింది మైక్రోసాఫ్ట్! కేవలం లైజన్ ఆఫీస్ లో ఐదుగురు ఉద్యోగులు మాత్రం కొనసాగుతారు!

ఇదంతా చైన్ రియాక్షన్!

ఆటోమోటివ్ దిగ్గజాలు అయిన సుజుకి, టొయోట, హోండా లు తమకి వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్థాన్ నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది! హోండా 70సీసీ బైక్ ధర 1,60,000/- పాకిస్తాన్ లో. అఫ్కోర్స్! పాకిస్థాన్ లో అసెంబ్లీంగ్ యూనిట్స్ మాత్రమే నెలకొల్పయి జపాన్ ఆటో సంస్థలు. కోవిడ్ తరువాత అవి కూడా మూత పడ్డాయి.

మైక్రోసాఫ్ట్ వల్ల అంతో కొంత డాలర్ల రూపంలో ఫారెక్స్ పాకిస్తాన్ రిజర్వ్ బాంక్ లో జమ అయ్యేవి కానీ ఇకనుండి అదీ ఉండదు!

జైహింద్!

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు