తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వక్స్ బోర్డు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల ది

వక్ఫ్ భూములను పరిరక్షించాలి

ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్

ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 5 ))

ఖమ్మంలోని వెలుగుమట్ల శివారు గొల్లగూడెం గ్రామ పరిధిలో ఈద్గా , ఖబరస్తాన్‌తో పాటు వీటిపక్కనున్న సర్వే నెంబర్ 431, 432 , 425 సర్వే నెంబర్లలోని సుమారు 350 కోట్ల విలువ చేసే వక్ఫ్ భూమిని కొంతమంది ప్రయివేట్ భూమిగా చూపిస్తూ జిల్లా అధికారుల అండతో కాజేస్తున్నారని ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్ ఆరోపించారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
వారు మాట్లాడుతూ ముస్తాఫానగర్‌లో సర్వే నెంబర్ 481 , 482 , 483 , 484 , 485 లలో సుమారు 15 ఎకరాల 24 కుంటల భూమి ఉందని , వీటికి సంబంధించిన ముతవల్లీలు , వారి వంశీకులు కలిసి అక్రమంగా అమ్ముకున్నారని తెలిపారు . అలాగే వెలుగుమట్ల రెవెన్యూ గొల్లగూడెం పరిధిలో మొత్తం 72.29 కుంటల భూమి ఉందని అన్నారు . ఈ భూములలో ముస్లింల ప్రార్థనా స్థలం , ఖబరస్తాన్ ఉన్నయని , వీటికి ఎలాంటి నష్టం జరిగినా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు . వెలుగుమట్ల రెవెన్యూలోని 431 సర్వే నెంబర్ సుమారు 12 ఎకరాల 34 కుంటల భూమి ఉందని , దీనిలో 4 ఎకరాల 11కుంటల భూమిని వక్ఫ్ భూమి కాదని వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ ఆడిటర్ ఎన్‌ఓసి ఆర్డర్ రాసి ఇచ్చారని చెప్పి అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ కనసైగలతో సర్వే నెంబర్ 425లో ఓ బిల్డర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు . ఈ విషయమై కలెక్టర్‌కు , మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఆధారాలు సమర్పించామని అన్నారు . వెంటనే ఈ భూమిని ఆక్రమణ
దారుల నుండి కాపాడాలని కోరారు . ఈ సమావేశంలో నసీమా ఆర్సి , తరుణం ఫాతిమా , రఫియా , జరీనా , అనీఫా , ఆఫ్రిన్ , మెహ్రజ్ , ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 37 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు