సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బీసీ లకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిన పాలక పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకురాలి తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , ఆ దిశగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడంలో విఫలమై నా బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నాయకత్వం విఫలమైందని నా బీసీ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఆవేదనతో కలత చెందిన ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది . ఆయనకు నివాళిగా తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పూలే ప్రాంగణం నుండి మయూరి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ ర్యాలీకి బీసీ జేఏసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ పెరుగు వెంకటరమణా యాదవ్ అధ్యక్షత వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి కృష్ణారావు , ఖమ్మం జిల్లా బీసీ ఉద్యమా నాయకులు మేకల సుగుణ రావు , పిండిపోలు రామ్మూర్తి బిసి జేఏసీ , బత్తిని మధు గౌడ్ , నరేందర్ విద్యావంతుల వేదిక , విజయ్ తెలంగాణ పీపుల్స్ జేఏసీ , కాకి భాస్కర్ స్పర్శ అధ్యయన వేదిక , బెజ్జంకి ప్రభాకర చారి టీఎన్జీవో , నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు ఎలమందల జగదీష్ , విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు వసంత బాబు , తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు బచ్చల పద్మాచారి , బద్రు నాయక్ నంగారా బేరి రాష్ట్ర నాయకులు , దాసరి శ్రీనివాస్ మాల మహానాడు , పాపారావు చారి , కొరివి ధనలక్ష్మి బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు , పోతురాజు రమాదేవి , నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు . పూలే విగ్రహం దగ్గర అమరుడు సాయి విశ్వనాచారి మృతికి సంతాపాన్ని ప్రకటించారు . బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వర చారి స్ఫూర్తి తోటి మరో ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు . 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో యువ నిరాకరించిన కాంగ్రెస్ , బిజెపి పార్టీల అవకాశవాద వైఖరికి నిరసనగా ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నాడు . ఇప్పటికైనా కాంగ్రెస్ , బిజెపి పార్టీలు స్పందించి న్యాయబద్ధంగా ఆలోచన చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టే బిల్లును ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 49 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 35 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 42 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం