


ఖమ్మం: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు
8వ డివిజన్ వైఎస్ ఆర్ కాలనీ లో సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు,ప్రముఖ మీడియా చానల్ కు చెందిన రిపోర్టర్.
అడ్డుకున్న తాజా మాజీ కార్పొరేటర్ సైదులు పై దాడి చేసిన సదరు వ్యక్తులు,దాడిలో విరిగిన తాజా మాజీ కార్పొరేటర్ సైదులు ఎడమ కాలు.
అర్బన్ పీ ఎస్ లో పిర్యాదు,కబ్జా రాయుళ్ల పై కేసు నమోదు చేసిన ఎస్సై గౌతమి.
ఇవ్వాళ ఆ కబ్జా స్థలంలో ప్రెస్ మీట్ పెట్టీ వివరాలు వెల్లడించిన స్థానిక కాంగ్రెస్ నేతలు,BRS నేతలు.
ఏమీ ఎరుగనట్టు మీడియా ముసుగులో వచ్చిన సదరు వ్యక్తి ని నిలదీసిన స్థానిక నేతలు.
ఈ కబ్జా కోరుల ధన దాహానికి,వారి గుప్పిట్లో నకిలీ ధృవ పత్రాలు,ఫోర్జరీ సంతకాలతో ఎన్ని ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములు,ఫ్రీడం ఫైటర్స్ భూములు దోచుకున్నారో తేలాలని డిమాండ్.
రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు ఈ ఇంటి దొంగలపై
దృష్టి సారించాలి,కేసులు నమోదు చేయాలి.






