పాలేరు మే 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు





ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి రాముడు చెరువు మీదుగా ఖమ్మం-కోదాడ రహదారి వరకు రూ.4.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు, రూ. 7. 15 కోట్లతో కూసుమంచి మండలం నర్సింహుల గూడెం నుండి గోప తండా వరకు డబుల్ లేన్ బీటి రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ , మున్సిపల్ చైర్పర్సన్ అనిత , వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , కమిషనర్ శ్రీనివాసరెడ్డి , పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్రెడ్డి , ఆర్డీఓ శ్రీనివాస్ , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






