ప్రతి సోమవారం నూతన కలెక్టరేట్లో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

కలెక్టర్ దరఖాస్తులను సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు

ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారం…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

*ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్ మూమెంట్ జరగాలి

*జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు నోట్స్ క్లుప్తంగా అందించాలి

*ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ అనంతరం అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, ఆగస్టు 04 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు దొండపాటి రమేష్, టి. వెంకటేశ్వర్లు కొణిజర్ల మండలంతో పాటు వివిధ మండల గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, అట్టి పశువుల షెడ్లకు బిల్లులు చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

వేంనూరు మండలం కల్లూరు గూడెం గ్రామ ప్రజలు తమ గ్రామంలోని ప్రజలకు పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని, తమ గ్రామంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

వైరా మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన రజియాబీ తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓ కొణిజర్లకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

కొణిజెర్ల గ్రామానికి చెందిన సుంకర నరసింహారావు సర్వే నెంబర్ 271 లో అనుమతి లేకుండా వెంచర్ వేశారని, ఆ వెంచర్ వేయక ముందు అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మైనర్ పంట కాలువ ఉందని, అట్టి కాల్వను ఆక్రమించి వేసిన అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కొణిజర్లకు రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

వైరా మండలం గోవిందా పురం గ్రామానికి చెందిన చల్లా వెంకట రమణ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పి.డీ. హౌసింగ్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన ఎం.మనోజ్ కుమార్ తను బి ఫార్మసీ పూర్తి చేసుకున్నానని, ఖమ్మం జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణి అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మంత్రుల పర్యటనకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మంత్రుల పర్యటన సమయంలో సంబంధిత కార్యక్రమాల జిల్లా అధికారులు తమ వెంట శాఖకు సంబంధించిన నోట్స్ తో రావాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా ఆన్ లైన్ లో ఫైల్ మూమెంట్ జరగాలని కలెక్టర్ తెలిపారు. 48 గంటలలో పరిష్కరించి తిరిగి పంపనున్నట్లు, తన దగ్గర ఫైల్స్ పెండింగ్ ఉండవని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తప్ప సాధారణ ఫైల్స్ మొత్తం ఈ-ఆఫీస్ లో ఉండాలని అన్నారు. ప్రతి బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ఏదైనా ఫైల్స్ పై డిస్కషన్ ఉంటే వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రతి సమావేశానికి సంబంధించి మినట్స్ కాపీలను 24 గంటల్లో అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు అందించే నోట్స్ బ్రీఫ్ గా ఉండాలని, అనవసరమైన సమాచారం ఇవ్వవద్దని అన్నారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు వైద్య కళాశాల పనులను…

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 0 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 17 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 26 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 17 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 24 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర