వైద్యుల నిర్లక్ష్యం పైన హెచ్ఆర్సీ ఆగ్రహం
వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!
వైద్యుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సి ఆగ్రహం!!
కమిటీ తీర్మానం అనంతరం శాఖ పరమైన చర్యలకు సిద్ధం!!
సిబ్బంది డ్యూటీ ల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సూపర్డెంట్ !!!
ఖమ్మం, జూన్ 2 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))


ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనేక విమర్శలకు తావిచ్చే విధంగా ఉన్న విధానం మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా వైద్యులు నిర్లక్ష్యం వల్ల 7 నెలల పసికందు యొక్క మూచి వారికి చేతిని కోల్పోయిన ప్రస్తుత విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు రావడం దీనిపై కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ముగ్గురు కమిటీ సభ్యులుగా నీలోఫర్ ఆసుపత్రికి , ఎంజీఎం కు , ఖమ్మం మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ ప్రాంతంలో జరిగిన దానిపై సమగ్ర విచారణ జరిపించి కమిటీ నివేదికను హెచ్ఆర్సీ కమిషనర్ కు అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా కమిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా హెచ్ఆర్సీకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ కమిటీలో పాల్గొంటారు, దీని విషయమై హాస్పటల్ సూపర్డెంట్ నరేందర్ నీ వివరణ కోరగా ఆస్పత్రిలో మా యొక్క వైద్య బృందం, సిబ్బంది ఎవరైతే ఇబ్బంది గురైనటువంటి పిల్లవాడికి సక్రమమైనటువంటి వైద్యం అందించడమే కాకుండా పిల్లవాడు యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది కానీ తన చేతికి సంబంధించినటువంటి రక్తప్రసరణకు సంబంధించిన నరాలు స్టక్ అవడంతో చేతికి ఇన్ఫెక్షన్ ఏర్పడి దానివల్ల మనకు దగ్గర ఉన్నటువంటి వైద్యం అందించాం తదుపరి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కి రిఫర్ చేయటంతో అక్కడికి వెళ్ళినప్పుడు వైద్యులు పరిశీలించి అతని యొక్క చేతికైనా ఇన్ఫెక్షన్ తల్లిదండ్రులకు తెలియజేసి చేతిని తొలగించకపోయినట్లయితే పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం కాబట్ట






