రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

*రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 3 వెంపటి నాయుడు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

మంత్రివర్యులు, గురువారం రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలని నందు సి.ఆర్.ఆర్.(ఎస్.సి.పి.) నిధులు 50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ తొలి విడతలో గుడిసెల్లో ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా గుడిసెలలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు రాని పక్షంలో ప్రతిపాదనలు అందించాలని వెంటనే మంజూరు చేస్తామని, దశల వారీగా మిగిలిన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.

గ్రామంలో గుడిసెలో ఉంటున్న వారి ఫోటోలు తీసుకొని రావాలని మంత్రి తెలిపారు. గ్రామంలో నిరుపేదలైన అర్హులకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ‌

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వేపకుంట్ల గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 50 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 36 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 43 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం