రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

*రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 3 వెంపటి నాయుడు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

మంత్రివర్యులు, గురువారం రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలని నందు సి.ఆర్.ఆర్.(ఎస్.సి.పి.) నిధులు 50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ తొలి విడతలో గుడిసెల్లో ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా గుడిసెలలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు రాని పక్షంలో ప్రతిపాదనలు అందించాలని వెంటనే మంజూరు చేస్తామని, దశల వారీగా మిగిలిన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.

గ్రామంలో గుడిసెలో ఉంటున్న వారి ఫోటోలు తీసుకొని రావాలని మంత్రి తెలిపారు. గ్రామంలో నిరుపేదలైన అర్హులకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ‌

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వేపకుంట్ల గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 9 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 7 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 6 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 8 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 13 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క