ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్
ఖమ్మం మార్చి 26 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు








ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 981 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవికుమార్ గెలుపొందారు. వారి గెలుపు పట్ల న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఐక్యమత్యంగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా యడ్లపల్లి రమేష్ ఉపాధ్యక్షులుగా షేక్ జానీ మియా
ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవికుమార్,
జాయింట్ సెక్రటరీగా దొబ్బల శిరీష,
క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శిగా ధరావత్ రామదాసు ,
లైబ్రరీ సెక్రటరీగా దేవరకొండ కళ్యాణి
కోశాధికారిగా రాజేశ్వరి
మహిళ న్యాయవాద ప్రతినిధిగా కనపర్తి రాధమ్మ ఎన్నికయ్యారు నూతన కార్యవర్గానికి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు






