మాజీ ఎమ్యేల్సి శ్రీ బాలసాని లక్ష్మినారాయణ గౌడ్
ఖమ్మం మే 30 మన జ్యోతి బ్యూరో
స్థానిక బాలాజీ ఎస్టేట్స్ ఆఫీసులో తెలంగాణ గౌడ సంఘం , గోపా సంఘం ఖమ్మం జిల్లా గౌడ సంఘం ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రఘునాధపాలేం గ్రామంలో ఇచ్చిన 29 కుంటల స్థలంలో గౌడ కమ్యూనిటీ హల్ నిర్మాణం కొసం జున్ నెలలొ జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం మరియు బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెలంగాణ గౌడ సంఘం మరియు గోపా , ఖమ్మం జిల్లా సమన్వయంతొ సన్నాహక సభను మాజీ ఎమ్యేల్సి శ్రీ బాలసాని లక్ష్మినారాయణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ సభ లో శ్రీ బాలసాని లక్ష్మినారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతిని రక్షించడానికి , అభివృద్ధి బాట పట్టటానికి , జాతి పిల్లల భవిష్యత్తు కొసం గౌడ జాతి మొత్తం ఎప్పటికప్పుడు చైతన్యవంతం అవుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వవాయి పాపన్న ఆశయాలను చేజిక్కించు కొనేందుకు ఖమ్మం నగరంలో స్థలం కేటాయించినదని తెలిపారు . ఇప్పుడు ఆ స్థలంలో గౌడ కమ్యూనిటీ హల్స్ నిర్మాణం కొసం అడుగులు పడుతున్న సంగతి అందరి దృష్టిలో ఉన్నదే . ఈ నిర్మాణానికి వచ్చే నేల జూన్ మొదటి వారం కాస్త అటు ఇటుగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ , గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క , గౌరనీయులు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , గౌరనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , గౌరనీయులు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎమ్యేల్సీ శ్రీ బొమ్మ మహేష్ కూమార్ గౌడ్ , గౌరనీయులు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లే లక్ష్మణ్ గౌడ్ మరియు గౌరవనీయులు తెలంగాణ గోపా అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గౌడ్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి తెలిపారు . జరుగబొయె గౌడ కమ్యూనిటీ హల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకొవడానికి అందరూ సహకరించాలని కొరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ గౌడ్ , చింతలపాటి వెంకటేశ్వర్లు గౌడ్ , జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు కత్తి నేహ్రు గౌడ్ , బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి గౌడ్ , గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని శ్రీనివాసరావు గౌడ్ , గుడిద శ్రీనివాస్ గౌడ్ , మార్కం లింగయ్య గౌడ్ , గండు యాదగిరి గౌడ్ , పొతగాని వెంకన్న గౌడ్ , అమరగాని వెంకన్న గౌడ్ , బొడపట్ల వెంకన్న గౌడ్ , బిచ్చాల తిరుమల రావు గౌడ్ , డాక్టర్ రాజశేఖర్ గౌడ్ , యరకల సైదులు గౌడ్ , తాళ్ళపల్లి రామకృష్ణ గౌడ్ మరియు ఖమ్మం జిల్లాలొని అన్ని మండలాల నుండి గౌడ మరియు గోపా సభ్యులు పాల్గొన్నారు .






