సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అకస్మిక తనిఖీ

తిరుమలాయపాలెం ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.

— పారదర్శకంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి

— సామాన్యుడు చేతిలో వజ్రాయుధం ఆర్టిఐ చట్టం,

— సమాచార హక్కుల కమిషన్, పి వి. శ్రీనివాసరావు.

తిరుమలాయపాలెం, ఆగస్టు 03 (( మన జ్యోతి ప్రతినిధి ))

తిరుమలాయపాలెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ పి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ కృపఉష డిప్యూటీ డిఎం & హెచ్ వో, ఇతర అధికారులతో, ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి అక్కడికక్కడే వైద్యం అందించాలని సూచించారు సిబ్బందితో డాక్టర్ చందు నాయక్ జరిగిన ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రంలోని పరిశుభ్రత, ఔషధ నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా సమాచార హక్కుల కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య హక్కు రాజ్యాంగపరమైన హక్కు. ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తమ హక్కులను తెలుసుకొని పోరాడాలి అన్నారు.అలాగే, సాధారణ పౌరుడు ప్రభుత్వ సేవలపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నాడని, ప్రజా వ్యవస్థలపై ప్రజల నిఘా తప్పనిసరి అని స్పష్టం చేశారు.తనిఖీ అనంతరం మండల ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్,. రికార్డులు, ప్రజల ఫిర్యాదుల ప్రాసెసింగ్, ఖాళీ పోస్టుల భర్తీ, మందుల సరఫరా వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు సేవలందించడంలో ఆలస్యం చేయవద్దని హెచ్చరించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కమిషనర్ పర్యటనపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, న్యూ డెమోక్రసీ నాయకులు కే నాగేశ్వరరావు, మేకల చంద్రశేఖర్, దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 49 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 36 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 43 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం