యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతి
హైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు అనుసంధానంగా రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరైంది.
ఈ మేరకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ చీఫ్ ఇంజనీర్ (PR ENC) జోగారెడ్డి , ఖమ్మం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) వెంకట్ రెడ్డి గారి ద్వారా జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఆర్డర్ కాపీని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు స్వీకరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడనుందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






