BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్
తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.
ఈ ఉదయం నుంచి ఆయన నివాసంలోనేగాక, బంధువులు స్నేహితులకు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నరహరి అక్రమంగా పోగేసిన ఆస్తుల చిట్టాను వెల్లడించారు. ఇవీ ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు:
రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు.
మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి.
పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మూడు హై-రైజ్ ఫ్లాట్లు.
గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో, ఛత్రినాకలో జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ టూ భవనాలు.
రూ. 1.54 కోట్ల నగదు, రూ. 2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్.
రూ.5.04 కోట్ల ఫిక్సుడ్ డిపాజిట్లు.
1.3 కిలోల బంగారం, 8.00 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు.
భార్య పేరున గల రెండు లాకర్ల గుర్తింపు, లగ్జరీ కార్లు.
గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 13.05 కోట్లు.
బహిరంగ మార్కెట్ లో ఆయా ఆస్తుల విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారుల వెల్లడి.





